Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బులు డిమాండ్ చేసిన ఏఈపై వేటు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 10:52 AM నల్గొండGeneral
డబ్బులు డిమాండ్ చేసిన ఏఈపై వేటు - Udayam
తిరుమలగిరి సాగర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో గృహ నిర్మాణ శాఖ అవుట్‌సోర్సింగ్ ఏఈ బుక్యా గోపిపై విజిలెన్స్ విచారణ జరిగింది. ఆరోపణలు నిజమని విచారణలో తేలింది. దీంతో ఏఈని ఉద్యోగం నుంచి తొలగిస్తూ కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

Comments

G
Loading comments...