వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి నాలుగు ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో చిరంజీవి తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కాలేకపోయారని పేర్కొన్నారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

