వార్తలకు తిరిగి వెళ్లండి

రామాజీపేట్లో జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయ కలశయాత్ర, శ్రీరామ పాదయాత్ర శుక్రవారం ఘనంగా నిర్వహించారు. “జై శ్రీరామ్” నినాదాలతో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీరామాలయం వరకు పాదయాత్ర చేపట్టారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మోహన్, ఉపసర్పంచ్ సుధీర్, ఆలయ చైర్మన్ రాజు, రమేష్ పాల్గొన్నారు
Comments
Loading comments...

