వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం రైతులకు పాస్పుస్తకాలను అందజేశారు.
భూమి హక్కుల వివరాలను పక్కాగా నమోదు చేసి రైతులకు మరింత భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సంక్షేమం, భూమి హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
Comments
Loading comments...

