వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్ఐఆర్ నమోదుకు నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ రాజీవ్ చౌక్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.
జిల్లా ఉపాధ్యక్షుడు కిమ్ ఫహద్ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేపై జరిగిన కులతత్వ చర్యను ప్రశ్నించినందుకే కక్షసాధింపుగా కేసు పెట్టారని, తక్షణమే ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

