వార్తలకు తిరిగి వెళ్లండి
బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నాణ్యతా లోపం!

జిల్లాలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయి. అనుమతులు లేని కేంద్రాల్లో పాడైపోయిన పదార్థాలు, అధిక రంగులతో స్నాక్స్ తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.
అధికారులు అప్పుడప్పుడు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటుండటంతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతాధికారి తెలిపారు.
Comments
Loading comments...