వార్తలకు తిరిగి వెళ్లండి
జీహెచ్ఎంసీ నిబంధన

రోజుకు 100 కిలోల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేసే సంస్థలు, సొసైటీలు తప్పనిసరిగా కేంద్ర వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. లేనిపక్షంలో రోజుకు రూ.1,000 జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు.
నిర్దేశించిన నాలుగు రంగుల డబ్బాల్లో తడి, పొడి, శానిటరీ, ఇతర వ్యర్థాలను వేరు చేసి నిర్వహించాలి. గుర్తింపు పొందిన వాహనాల ద్వారా మాత్రమే చెత్తను తరలించాలని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...