వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాకు చెందిన నయనశ్రీ జాతీయ షార్ట్ ట్రాక్ స్పీడ్ ఐస్ స్కేటింగ్ పోటీల్లో సత్తా చాటారు. డెహ్రడూన్లో జరిగిన పోటీల్లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించి, ఐదవసారి జాతీయ ఛాంపియన్గా రికార్డు సృష్టించారు.
గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆమె ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు. డిగ్రీ చదువుతూనే క్రీడల్లో నయనశ్రీ సాధిస్తున్న ఈ విజయాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
Comments
Loading comments...

