వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి. ఇందుకోసం ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లలో ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేశారు. గతంలో చుక్కలు వేయించినా ఈసారి మరోసారి వేయించాలి.
ఆదివారం కుదరని పక్షంలో, సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది నేరుగా ఇళ్లకు వచ్చి చుక్కలు వేస్తారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పిల్లలను పోలియో బారి నుండి రక్షించాలి.
Comments
Loading comments...

