వార్తలకు తిరిగి వెళ్లండి
బంగ్లాదేశ్ పర్యాటకులకు భారత్ గ్రీన్ సిగ్నల్
హరిక శర్మ Jun 25, 2026 4:50 PM అల్ ఇండియా 15 viewsabout 13 hours ago

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత బంగ్లాదేశ్ పర్యాటకులకు భారత్ టూరిస్ట్ వీసాలను పునరుద్ధరించింది. పర్యాటకులు జూన్ 28 నుంచి వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది ప్రకటించారు. ప్రస్తుతానికి 5 వీసా అప్లికేషన్ కేంద్రాల (IVAC) ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనలు, షేక్ హసీనా పలాయనంతో వీసాల జారీ నిలిచిపోయింది. అయితే, ఇటీవల బంగ్లాలో బీఎన్పీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు తిరిగి గాడిన పడుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...