వార్తలకు తిరిగి వెళ్లండి
నరమేధంపై ప్రజాగ్రహం

రంగారెడ్డి జిల్లా షాబాద్, దైవాలగూడలో శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురిని దారుణంగా హత్య చేసిన ఘటనపై బంధువులు, గ్రామస్థులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ షాద్నగర్-కంది రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు.
నిందితుడిపై పోక్సో కేసు నమోదైనా పోలీసులు అరెస్టు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ ధర్నాలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సహా పలువురు నేతలు పాల్గొనగా, రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి జనజీవనం ఇబ్బందుల్లో పడింది.
Comments
Loading comments...