వార్తలకు తిరిగి వెళ్లండి
భూముల సర్వే, రీసర్వే ను పకడ్బందీగా నిర్వహించాలి

రాష్ట్రంలో భూముల సర్వే, రీసర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూముల సర్వే, రీసర్వే అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఈ వీసీలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, ల్యాండ్ సర్వేయర్ నరసింహ మూర్తి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...