Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలో పచ్చదనం పెంచడమే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 06, 2026 2:40 PM జగిత్యాలGeneral
పట్టణంలో పచ్చదనం పెంచడమే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ - Udayam
పట్టణంలో పచ్చదనం పెంపుతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల 14వ వార్డులో వన మహోత్సవం సందర్భంగా మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఫిల్టర్‌ బెడ్‌ వద్ద రూ.5 లక్షలతో గ్రీన్‌ షెడ్‌కు భూమిపూజ చేసి, 15 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌ పనులను పరిశీలించారు.

Comments

G
Loading comments...