Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలోనే జ్యోతిరావు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
H M G H Q Aug 25, 2026 6:41 PM కర్నూలుGeneral
పత్తికొండలోనే జ్యోతిరావు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలి - Udayam
పత్తికొండకు కేటాయించిన మహాత్మ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని, కంబలపాడుకు తరలించే నిర్ణయాన్ని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షాబిర్ భాష డిమాండ్ చేశారు. మంగళవారం పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో సంతకాల సేకరణ చేపట్టారు. మారుమూల ప్రాంతానికి తరలిస్తే చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.

Comments

G
Loading comments...