Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్రికా విలేఖరి పై దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 1:12 PM విజయనగరంGeneral
పత్రికా విలేఖరి పై దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు - Udayam
విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఇటీవల ఓ ప్రముఖ పత్రిక విలేఖరి పి.గోవిందుపై కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం గుమ్మలక్ష్మిపురంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో అనధికార లేఅవుట్లు వేశారని వార్త రాయడంతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు.

Comments

G
Loading comments...