Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: డా. రహీం

Follow Udayam on Google
బాలాజీ Jul 31, 2026 3:07 PM సంగారెడ్డిGeneral
పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: డా. రహీం - Udayam
వర్షాకాలంలో పశువులు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని నాగల్‌గిద్ద మండల పశు వైద్యాధికారి డా. రహీం సూచించారు. పశువులకు సకాలంలో టీకాలు వేయించడం, నట్టల నివారణ మందులు ఇవ్వడం, శుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం అందించాలని తెలిపారు. పశువుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ పశు వైద్యశాలను సంప్రదించాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...