వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల మొగ్గు

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో వర్షాభావం, కడెం ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల కాకపోవడంతో రైతులు వరి సాగుకు దూరంగా ఉంటున్నారు. మందపల్లి గ్రామంలో కేవలం 30 శాతం విస్తీర్ణంలోనే సాగు చేపట్టి, వరికి బదులుగా పెసర్లు, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు.
నీటి కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు కూడా రైతులకు సూచిస్తున్నారు.
Comments
Loading comments...