Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PRTU నాగల్ గిద్ద మండల అధ్యక్షుడు శేరికర్ రమేష్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
బాలాజీ Aug 22, 2026 7:29 PM సంగారెడ్డిGeneral
PRTU నాగల్ గిద్ద మండల అధ్యక్షుడు శేరికర్ రమేష్‌కు ఘన సన్మానం - Udayam
నూతనంగా రెండోసారి పిఆర్టీయూ నాగల్‌గిద్ద మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శేరికర్ రమేష్‌ను కరస్‌గుత్తి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. రాములు ఆధ్వర్యంలో రమేష్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కిషోర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హీరామన్, మండల స్ట్రాంగ్ టీచర్ రాఘవేంద్రతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...