Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలకు ఉచిత న్యాయం అందించాలి: సివిల్ జడ్జి

కౌశిక్ శర్మ Jun 29, 2026 11:24 AM శ్రీకాకుళం 3 viewsabout 2 hours ago
నిరుపేదలకు ఉచిత న్యాయం అందించాలి: సివిల్ జడ్జి - Udayam Digital
నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ఎస్.వాణి సోమవారం ప్యానల్ అడ్వకేట్లతో సమావేశమయ్యారు. న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేక జైళ్లలో మగ్గుతున్న నిరుపేదలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని ఆమె పిలుపునిచ్చారు. న్యాయం అందక ఇబ్బంది పడుతున్న వారి కేసులను ఉచితంగా స్వీకరించి, వారికి సత్వర న్యాయం అందేలా చూడాలని లాయర్లకు ఆమె దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...