వార్తలకు తిరిగి వెళ్లండి
పునరావాస కాలనీలో వసతులు కల్పించాలి: భాజపా

జోగులాంబ గద్వాల జిల్లా కొత్త రాజోలి పునరావాస కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని భాజపా నేత రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన కాలనీని పరిశీలించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
2009 వరద బాధితులకు కేటాయించిన ఈ గృహాలలో రోడ్లు, డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేనేత కార్మికుల మగ్గం గుంతల్లో నీరు చేరి ఉపాధి కోల్పోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...