Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంతో నిర్మల్ రైతు మృతి..

సతీష్ కుమార్ Jul 12, 2026 3:24 PM నిర్మల్ 1 viewsabout 1 hour ago
విద్యుదాఘాతంతో నిర్మల్ రైతు మృతి..  - Udayam Digital
నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ బొప్పారం గ్రామానికి చెందిన రాచర్ల ముత్యం (46) అనే రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఆయన కాలినడకన తన వ్యవసాయ పొలానికి వెళ్తుండగా, మార్గమధ్యంలో రహదారి పక్కన ఉన్న ఎల్‌టీ లైన్ (LT Line) విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు తగలడంతో ఈ దారుణం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Comments

G
Loading comments...