వార్తలకు తిరిగి వెళ్లండి

సమాన పనికి సమాన వేతనం, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల కలెక్టరేట్ వద్ద గురువారం మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్లను ఉపసంహరించాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు.
ధర్నా అనంతరం కలెక్టరేట్లోకి వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రతినిధులుగా నలుగురికి మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

