Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డయల్-112 కాల్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి రక్షణ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 1:41 PM కోనసీమGeneral
డయల్-112 కాల్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి రక్షణ - Udayam
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూర్ లంక వంతెనపై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు రక్షించారు. డయల్-112కు వచ్చిన సమాచారంతో కొవ్వూరు రూరల్ పోలీసులు వెంటనే స్పందించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పోలీసుల సంరక్షణలో ఉన్నాడని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించే చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. 112 సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Comments

G
Loading comments...