వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండలం సుర్జాపూర్ ఎస్సీ కాలనీ నుంచి వేంకటేశ్వర ఆలయానికి వెళ్లే దారిలోని మత్తడి వాగు వంతెన శిథిలమై గుంతలమయంగా మారింది. చిన్నపాటి వర్షానికే వంతెనపై వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి.
ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. పురాతన రహదారికి నూతన రోడ్డు మంజూరు చేయడంతోపాటు వంతెనపై గుంతలను పూడ్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

