Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలతో మమేకమైన పోలీసులు

Follow Udayam on Google
K Anuradha Aug 31, 2026 11:29 PM శ్రీకాకుళంGeneral
ప్రజలతో మమేకమైన పోలీసులు - Udayam
మందస మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పోలీసులు ‘పల్లెనిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం. తిరుపతిరావు సువర్ణపురం, ఎస్సై కె. కృష్ణప్రసాద్ పిడిమందస గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. సైబర్ నేరాలు, ఆస్తి నేరాల నివారణ, నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...