Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 10, 2026 6:33 PM మంచిర్యాలGeneral
ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి - Udayam
కార్మిక, రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విడనాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికారపు అశోక్ డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం లక్షెట్టిపేట పట్టణంలోని ఊతుకూర్ చౌరస్తాలో ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు, రైతులు, కార్మికులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...