Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదు

Follow Udayam on Google
K Anuradha Aug 31, 2026 2:53 PM శ్రీకాకుళంGeneral
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదు - Udayam
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక–ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. పింఛన్లు, గృహ నిర్మాణాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్, కాలువల శుభ్రత తదితర అంశాలపై 36 వినతిపత్రాలను సమర్పించారు. వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...