వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం తీవ్ర విచారం కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని తెలిపారు.
కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేసి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...
