Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యకర సమాజం-ఎమ్మెల్యే నల్లమిల్లి

Follow Udayam on Google
devendra Aug 22, 2026 1:21 PM తూర్పుగోదావరిGeneral
పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యకర సమాజం-ఎమ్మెల్యే నల్లమిల్లి - Udayam
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత అవసరమని తద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం పందలపాకలో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి తో ఎమ్మెల్యే కలిసి గ్రామంలో ర్యాలీ చేశారు. అనంతరం కూటమి నాయకులతో స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. రోడ్లు ఊడ్చి చెత్తను ఎత్తారు.

Comments

G
Loading comments...