Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని పర్యటన వేళ బాంబు బెదిరింపులు

పార్వతి దేవి Jul 13, 2026 5:51 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
ప్రధాని పర్యటన వేళ బాంబు బెదిరింపులు - Udayam Digital
హర్యానా, పంజాబ్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ వచ్చిన ఈమెయిల్ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఖలిస్తాన్ అనుకూల గ్రూపు పేరుతో వచ్చిన బాంబు బెదిరింపుల హెచ్చరికలతో భద్రతా సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ నెల 17న జింద్‌లో ప్రధాని నిర్వహించబోయే భారీ ర్యాలీని లక్ష్యంగా చేసుకుంటామని, అదే రోజు చండీగఢ్, జలంధర్‌లలోని పాఠశాలలు, రైల్వే స్టేషన్లలో పేలుళ్లు జరుపుతామని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...