వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ కాలుష్యానికి ఏఐ ‘చెక్’

ఢిల్లీలో కాలుష్య నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి 'డీపీసీసీ 2.0' వెర్షన్ పోర్టల్ను ప్రారంభించారని పర్యావరణ మంత్రి వెల్లడించారు. 500 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో జరిగే నిర్మాణ పనుల్లో దుమ్ము, కాలుష్య నియంత్రణను పర్యవేక్షించేందుకు ఇది ఉపయోగపడనుంది.
దేశంలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా నిజసమయ (రియల్-టైమ్) నిఘా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నమోదిత నిర్మాణ స్థలాల వద్ద తీవ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు.
Comments
Loading comments...