వార్తలకు తిరిగి వెళ్లండి

యానాం రేవులో శుక్రవారం 1.300 కిలోల మగ పులస చేపకు రూ.24 వేల భారీ ధర పలికింది. మత్స్యకార మహిళ పార్వతి రెండు పులస చేపలను రూ.24 వేలు, రూ.7,500 చొప్పున వేలంలో దక్కించుకున్నారు.
1.300 కిలోల పులసకు ఈ ఏడాది ఇంత ధర రావడం ఇదే తొలిసారని మత్స్యకారులు తెలిపారు. వాతావరణ మార్పులతో ఈ సీజన్లో గోదావరి జిల్లాల్లో పులసలు అరుదుగా లభిస్తున్నాయి.
Comments
Loading comments...

