వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గి మండలం అడిగోప్పలలో అచ్చు బొమ్మ స్థావరంపై పోలీసులు దాడి చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి జూదం సొమ్ము రూ.400 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన మరికొందరు అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ బి.గోపాల్ తెలిపారు. జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

