Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల అదుపులో బైక్ చోరీల ముఠా నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Follow Udayam on Google
raju Aug 27, 2026 7:50 PM నిజామాబాద్General
పోలీసుల అదుపులో బైక్ చోరీల ముఠా నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం - Udayam
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను రెండో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో 4 టౌన్ పరిధిలోని వినాయకనగర్, బోర్గం ప్రాంతాలకు చెందిన 2 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. మరో వాహనం డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధికి, ఇంకొకటి రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవిగా తేలింది.

Comments

G
Loading comments...