వార్తలకు తిరిగి వెళ్లండి
గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల నిఘా

ఒడిశా, ఏపీల నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా గంజాయి స్మగ్లింగ్ ముమ్మరంగా సాగుతోంది. పోలీసులు, ఈగల్ ఫోర్స్ తనిఖీల్లో 'పుష్ప' సినిమా తరహా ప్రత్యేక అరలున్న కంటైనర్లతో సహా భారీగా సరకు పట్టుబడుతోంది.
గడిచిన ఆరు నెలల్లోనే రూ.10 కోట్ల విలువైన 2,035 కిలోల గంజాయిని సీజ్ చేసి, 33 కేసులు నమోదు చేశారు. స్థానికంగా యువతలో వినియోగం పెరుగుతుండటంతో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...