Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్లు దాటినా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ శూన్యం

అనురూప్ గౌడ్ Jul 03, 2026 3:38 AM మెదక్ 6 viewsabout 1 hour ago
రెండేళ్లు దాటినా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ శూన్యం - Udayam Digital
నర్సాపూర్‌లో రెండేళ్ల క్రితమే 252 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా, అధికారుల నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఎన్నికల ముందు హడావుడి చేసిన యంత్రాంగం, ఆ తర్వాత సర్వేను అటకెక్కించడంతో ఈ ఇళ్లు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మరో 248 ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోగా, త్వరలోనే సర్వే పూర్తి చేసి కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.

Comments

G
Loading comments...