వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో దొంగల ముఠాపై పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తనిఖీల సమయంలో బొలెరోలో వెళ్తున్న ముఠా ఆగకుండా వెళ్లడంతో పోలీసులు రెండు గంటలపాటు వెంబడించారు.
పరిగి మండలం ఊటుకూరు వద్ద కాల్పులు జరిపినా దుండగులు తప్పించుకుని పారిపోయారు. ఈ నెల 6న పోలీసు జీపును ఢీకొట్టిన ముఠానే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తూ గాలిస్తున్నారు.
Comments
Loading comments...

