వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడబోతున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున రక్షించారు. కుటుంబ కలహాల కారణంగా అయ్యప్ప అనే వ్యక్తి రైల్వే ట్రాక్పైకి చేరుకుని, తన నిర్ణయం గురించి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, సమయస్ఫూర్తితో ట్రాక్ వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేస్తున్న అయ్యప్పను అడ్డుకుని, ప్రాణాలతో కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి, అతడిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Loading comments...

