Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ఏకో సెన్సిటివ్‌ జోన్‌ కమిటీ గడువు పొడిగింపు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 01, 2026 6:39 PM మెదక్General
పోచారం ఏకో సెన్సిటివ్‌ జోన్‌ కమిటీ గడువు పొడిగింపు - Udayam
మెదక్‌ జిల్లా పోచారం ఏకో సెన్సిటివ్‌ జోన్‌ కమిటీ కాలపరిమితిని ప్రభుత్వం పదేళ్లకు పొడిగించింది. వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ ప్రాంతాల రక్షణ కోసం 2015లో పోచారాన్ని ఏకో సెన్సిటివ్‌ జోన్‌గా గుర్తించారు. కమిటీకి నిజామాబాద్‌ కలెక్టర్‌ అధ్యక్షుడిగా, మెదక్‌ కలెక్టర్‌ ప్రతినిధిగా ఉంటారు. అటవీ పనుల పర్యవేక్షణ, ఆక్రమణల నివారణ, అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వడం వంటి బాధ్యతలను కమిటీ నిర్వహిస్తుంది.

Comments

G
Loading comments...