Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23న పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణ

Follow Udayam on Google
శివ కుమార్ Aug 14, 2026 2:36 PM మంచిర్యాలతెలంగాణ
23న పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణ - Udayam
మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ 29వ డివిజన్‌లో ఈ నెల 23న నిర్వహించనున్న పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణకు మేయర్‌ మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ రమ్యలను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శుక్రవారం వారికి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వాటర్‌ ట్యాంక్‌ ఏరియా కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...