వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
శుక్రవారం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పనులను పరిశీలించిన అనంతరం స్టేషన్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. రూ.34 కోట్లతో చేపట్టిన పనులు మూడేళ్ల నుంచి జరుగుతున్నాయని, 3 నెలల్లో పూర్తి చేయకపోతే స్టేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు
Comments
Loading comments...

