Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల బీమాలో అర్హులైన రైతులందరూ నమోదు కావాలి: కలెక్టర్

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 8:24 AM విజయనగరంGeneral
పంటల బీమాలో అర్హులైన రైతులందరూ నమోదు కావాలి: కలెక్టర్ - Udayam
విజయనగరం జిల్లాలో పంటల బీమా పథకం అమలుపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం వ్యవసాయ, బ్యాంకింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హత కలిగిన ప్రతీ రైతుకు పంటల బీమా రక్షణ కల్పించాలని ఆదేశించారు. నమోదు గడువును ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 56,139 మంది రైతులు బీమా నమోదు చేసుకున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...