వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం, సువర్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయాలను మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి (DPO) వినోద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని రికార్డులు, రిజిస్టర్లు, పన్ను వసూళ్ల వివరాలు, నగదు పుస్తకాలను ఆయన నిశితంగా పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా తీరుపై ఆయన ఆరా తీశారు.
Comments
Loading comments...

