Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్మికులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 2:34 PM వికారాబాద్General
పంచాయతీ కార్మికులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి: సీఐటీయూ - Udayam
పంచాయతీ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్‌కు నాయకులు, కార్మికులు కలిసి వినతిపత్రం అందజేశారు. ​ప్రభుత్వాలు మారినా కార్మికుల సమస్యలు తీరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...