Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

Follow Udayam on Google
H M G H Q Aug 23, 2026 4:35 PM కర్నూలుGeneral
పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి - Udayam
పత్తికొండ గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదువుల రామయ్య భవన్‌లో బి. నరసింహ అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, నెలకు మూడు రోజుల సెలవులు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని కోరారు. ఇల్లు లేని వారికి స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...