వార్తలకు తిరిగి వెళ్లండి
భోగాపురం ప్రారంభోత్సవానికి మోదీ

ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానుండటంతో ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల పర్యవేక్షణకు నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.
కేతన్ గార్గ్, రాహుల్ మీనా, ధ్యాన చంద్ర, మయూర్ అశోక్లు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. వీరికి సాయంగా 26 మంది అధికారులను కేటాయించగా, వీరంతా విజయనగరం కలెక్టర్కు రిపోర్ట్ చేయనున్నారు.
Comments
Loading comments...