Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PGRS లో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 7:40 PM విజయనగరంGeneral
PGRS లో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి - Udayam
ప్రజా సమస్యల పరిష్కార వేదిక బాధితుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన PGRS లో ప్రజల నుంచి 35 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో 20 భూతగాదాలు, 4 కుటుంబ కలహాలు, ౩ మోసాలు, 8 ఇతర సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు విచారణ జరిపి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...