Back to feed
పెట్రో సెగ: తగ్గిన విమాన సర్వీసులు
Ritika Singh May 28, 2026 6:56 AM హైదరాబాద్ 5 views30 minutes ago

పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ దేశీయ సర్వీసులను తగ్గించుకుంటున్నాయి. రానున్న జూన్ నుండి ఆగస్టు వరకు ఈ కోతలు అమల్లో ఉంటాయని సంస్థలు ప్రకటించాయి. ఎయిర్ ఇండియా సుమారు 22 శాతం, ఇండిగో 5-7 శాతం సర్వీసులను నిలిపివేస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్ వాటా 40 శాతానికి చేరడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి.
Comments
Loading comments...


