వార్తలకు తిరిగి వెళ్లండి
కొత్త రాజోలిలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలని వినతి

రాజోలికి మంజూరైన తహసీల్దార్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ భవనాలను కొత్త రాజోలిలో నిర్మించాలని అఖిలపక్ష కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్ రామ్మోహన్కు వినతిపత్రం అందజేశారు.
కొత్త రాజోలిలో నిర్మిస్తే వరద ముప్పు ఉండదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరా స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. కార్యాలయ నిర్మాణానికి సహకరించాలని తహసీల్దార్ను కోరారు.
Comments
Loading comments...