వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన పెన్షన్ల దరఖాస్తుకు ప్రభుత్వం విధించిన గడువును ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు పొడిగించాలని లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి. సంఘం కోరారు. పేదలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు అవసరమైన పత్రాలు సమర్పించేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు గంగాపురం గ్రామ సచివాలయంలో అడ్మిన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వెలమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

